హైదరాబాద్లో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన విజయవంతం కావడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ అంటే క్రీడలు, తెలంగాణ అంటే శ్రేష్ఠత, తెలంగాణ అంటే ఆతిథ్యం అని ప్రపంచానికి చాటి చెప్పామని ఆయన అన్నారు. ఈ మెగా ఈవెంట్ను విజయవంతం చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. "మా ఆహ్వానాన్ని మన్నించి హైదరాబాద్ నగరానికి విచ్చేసి క్రీడాభిమానులను, ముఖ్యంగా యువతను ఉత్సాహపరిచిన ఫుట్బాల్ దిగ్గజాలు లియోనెల్ మెస్సీ, లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్లకు హృదయపూర్వక ధన్యవాదాలు" అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరై, ఈ సాయంత్రాన్ని జీవితాంతం గుర్తుండిపోయేలా చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa