ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కలెక్టరేట్ లో సమస్యల పరిష్కారానికి ఆదేశాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Dec 15, 2025, 08:07 PM

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 107 ఫిర్యాదులు అందినట్లు అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలతో కూడిన అర్జీలను ఆయన లా ఆఫీసర్ చంద్రావతితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా, సమస్యల పరిష్కారానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa