హైదరాబాద్ మెట్రో రైలు నెట్వర్క్ను భారీగా విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జీహెచ్ఎంసీ పరిధి దాటి ఔటర్ రింగ్ రోడ్ వరకు మెట్రో సేవలను అభివృద్ధి చేయాలని భావిస్తోంది. దీని నిర్వహణ కోసం ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేసి, దానికి పూర్తి స్వయం ప్రతిపత్తి కల్పించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మెట్రో రెండో దశ విస్తరణకు భూసేకరణ అవసరం తక్కువగా ఉంటుందని, నాగోల్–ఎల్బీనగర్ మీదుగా విమానాశ్రయం వరకు, ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు నిర్మించే మార్గాల్లోనే అధిక భూసేకరణ అవసరమవుతుందని అధికార వర్గాలు తెలిపాయి. మిగతా కారిడార్లలో సుమారు 30 శాతం భూములు సరిపోతాయని అంచనా.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa