ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హోమ్‌లోన్ మాఫీ కోసం ప్రియుడితో భర్తను హత్యచేయించిన భార్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 25, 2025, 12:02 PM

మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో భూక్య వీరన్న అనే వ్యక్తిని అతని భార్య విజయ, ప్రియుడు బోడ బాలాజీ కలిసి హత్య చేశారు. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వీరన్న తీసుకున్న హోమ్‌లోన్.. ప్రమాదవశాత్తు మరణిస్తే మాఫీ అవుతుందనే దురాశతో ఈ హత్యకు పాల్పడ్డారు. ఈనెల 22న రాత్రి మద్యం తాగుదామని తీసుకెళ్లి.. వీరన్నను బాలాజీ ఇనుప రాడ్డుతో కొట్టి చంపాడు. అనంతరం మృతదేహాన్ని రోడ్డు పక్కన బైక్‌తో సహా పడేశారు. అయితే పోలీసులు కేసును ఛేదించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa