భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) 100 సంవత్సరాల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని తుర్కయంజాల్లో సిపిఐ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఓరుగంటి యాదయ్య మాట్లాడుతూ, స్వాతంత్రం, నైజాం, రాజరిక, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు జాతీయ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వేలాది గ్రామాలను విముక్తి చేసి, లక్ష ఎకరాల భూమిని ప్రజలకు పంచిన ఘనత సిపిఐదని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa