ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పార్వతి సిద్ధిరామేశ్వర స్వామి దేవాలయ దశమ వార్షికోత్సవానికి పద్మాదేవేందర్ రెడ్డికి ఆహ్వానం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 19, 2026, 02:41 PM

మెదక్ జిల్లా హవేలిఘనపూర్ మండలంలోని వాడి గ్రామంలో ఈ నెల 30వ తేదీన శుక్రవారం శ్రీశ్రీశ్రీ పార్వతి సిద్ధిరామేశ్వర స్వామి దేవాలయ దశమ వార్షికోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ సంజీవరెడ్డి, సభ్యులు మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఎం. పద్మాదేవేందర్ రెడ్డిని హైదరాబాద్ కొంపల్లిలోని ఆమె నివాసంలో సోమవారం కలిసి ఆహ్వాన శుభపత్రికను అందజేశారు. వార్షికోత్సవానికి విచ్చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ భక్త బృందం సభ్యులు మల్లయ్య, నర్సింలు, రాజులు, మహేందర్, దుర్గయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa