గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాన్ని పురస్కరించుకుని సిలువ మరణం ద్వారా పునరుత్థాసుడైన ఏసుక్రీస్తును స్వాగతిస్తూ ఈ నెల 4వ తేదీన విజయవాడలో రన్ ఫర్ జీసస్ ర్యాలీని నిర్వహించనుంది. ఏసుక్రీస్తును స్మరించుకుంటూ 15 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఉ.5.30 గంటలకు పటమట, నిర్మలా కాన్వెంట్ దగ్గర సెయింట్ పాల్స్ కథెడ్రల్ నుంచి రన్ ఫర్ జీసస ర్యాలీ ప్రారంభమై.. చర్చి ప్రాంగణం వరకు కొనసాగుతుందన్నారు.క్రైస్తవ్యం మతం కాదని, అది ఒక సన్మార్గమని, సాటి మానవునికి సహాయపడటం, బీదలను కనికరించటమే దీని ముఖ్య ఉద్దేశమని ది సాల్వేషన్ ఆర్మీ బాపట్ల మండల నాయకులు మేజర్ వి యేసుపాదం తెలిపారు. గురువారం విజయలక్ష్మి పురంలో జరిగిన బాపట్ల క్రైస్తవ నాయకుల రన్ ఫర్ జీసస్ 2026 సదస్సులో ఆయన మాట్లాడుతూ, క్రైస్తవ మిషనరీలు, సంస్థలు అనాదికాలముగా ఉన్న ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపగలిగాయని పేర్కొన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పును పునః పరిశీలించాలని ఆయన ఈ సందర్భంగా అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa