జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులు రోడ్డు నియమాలను కచ్చితంగా పాటించి రహదారి భద్రతకు ప్రజలకు ఆదర్శంగా నిలవాలని సూచించారు.జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన “అరైవ్ - అలైవ్” అవగాహన కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి, ఎస్పీ శ్రీనివాసరావు మరియు కలెక్టర్ ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అన్ని అధికారులు తప్పక రహదారి నియమాలను పాటించాలన్నారు. అదనంగా, రహదారులు నాణ్యత, భద్రతతో రూపొందించే విధంగా ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖలు నిరంతరం శ్రద్ధ వహించాలని చెప్పారు.ఎమ్యెల్యే కృష్ణమోహన్రెడ్డి మాట్లాడుతూ, నిత్యం చోటుచేసుకునే రహదారి ప్రమాదాలు ఇప్పుడు సాధారణంగా మారిపోయాయని, ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే ప్రతి ఒక్కరు రహదారి భద్రతపై అవగాహన కలిగి ముందుకు రావాలి అని చెప్పారు.మద్యం తాగి, సెల్ఫోన్ ఉపయోగిస్తూ వాహనాలు నడపడం వంటి అలవాట్ల కారణంగా ప్రమాదాలు ఎక్కువవుతున్నాయని, అందుకే ప్రజల్లో రహదారి భద్రతపై అవగాహన పెంచడం అత్యవసరమని పేర్కొన్నారు. ఎస్పీ మాట్లాడుతూ, బాధ్యతాయుతమైన ప్రవర్తన ద్వారా మాత్రమే రహదారి ప్రమాదాలను నివారించగలమని చెప్పారు.కార్యక్రమం ముగిసిన తరువాత, అధికారులు మరియు సిబ్బంది కలిసి రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగరావు, అదనపు ఎస్పీ శంకర్, ఆర్డీవో అలివేలు కూడా పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa