ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నందిని నగర్ కాలనీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 26, 2026, 10:36 AM

హైదరాబాద్, ఉప్పల్ లోని చెంగిచెర్ల నందిని నగర్ కాలనీ వాసులు 2026 జనవరి 26న గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు నిర్వహించారు. గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, అనంతరం జెండా ఆవిష్కరించారు. బి.ఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమలులోకి వచ్చిన సందర్భంగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ నర్సారెడ్డి, నర్సింగరావు, దేవరాజ్ రెడ్డి, అశోక్, బాల్ రెడ్డి, నరేందర్, రమేష్, గోవర్దన్, నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa