గట్టు మండలంలోని అన్ని గ్రామాల్లోని ప్రభుత్వ భవనాలు పాఠశాలల్లో 2026 జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కొత్త సర్పంచ్ కుమ్మరి పార్వతమ్మ శేఖర్, ఉపసర్పంచ్ మాల నర్సమ్మ ఆంజనేయులు సమక్షంలో మిట్టదొడ్డి గ్రామంలో విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయురాలు రాణి లీలావతి ఉపాధ్యాయుల కొరత, మౌలిక వసతుల సమస్యలను ప్రస్తావించగా, సర్పంచ్ వాటిని త్వరలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు కలిసిమెలసి చదువుకోవాలని, అన్ని విధాలుగా అండగా ఉంటామని ఉపసర్పంచ్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa