హైదరాబాద్లోని మదీనాగూడ ప్రధాన రహదారిపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న ఓ గుర్తుతెలియని వ్యక్తిని వేగంగా వచ్చిన టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన బాధితుడిని వెంటనే స్థానికులు చందానగర్ పీఆర్కే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించారు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa