TG: హన్మకొండ జిల్లా పరకాల మున్సిపాలిటీ ఫలితాల లెక్కింపు ఉత్కంఠగా సాగుతోంది. ఈ మేరకు మున్సిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి సుభద్ర, సమీప బీఆర్ఎస్ అభ్యర్థి శనిగరపు రజనీపై ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి 369, బీఆర్ఎస్ అభ్యర్థికి 368 ఓట్లు పోల్ అయ్యాయి. అయితే ఒక్క ఓటు తేడా రావడంతో అధికారులు రీ కౌంటింగ్ చేసి సుభద్ర గెలుపును ప్రకటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa