ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు.. భర్తను చంపిన భార్య

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 20, 2026, 11:39 AM

 టీవీ సౌండ్‌ తగ్గించమని అడిగిన భర్తను భార్య దారుణంగా హత్య చేసింది. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని మంగళగిరి టిడ్కో ఇళ్ల సముదాయంలో గురువారం రాత్రి  జరిగింది. టీవీ సౌండ్ తగ్గించమని భర్త అహ్మద్‌.. భార్య క్రాంతిని కోరాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య గొడవ జరిగింది. ఘర్షణ తారస్థాయికి చేరడంతో అహ్మద్‌ను క్రాంతి కత్తితో పొడిచి చంపేసింది. అహ్మద్‌, క్రాంతి ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకోవడం గమనార్హం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa