నల్గొండ జిల్లా చౌటుప్పల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి లింగంపల్లి నరసింహ ఇంట్లో భారీ దోపిడీ జరిగింది. శనివారం రాత్రి ఆయన ఇంటి బీరువాలో భద్రపరిచిన రూ.22 లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం ఈ నగదును ఆయన సమకూర్చుకున్నారు. ఇంటి తాళం పగులగొట్టి దొంగలు లోపలికి చొరబడినట్లు పోలీసులు తెలిపారు. బంగారు ఆభరణాలు, కొంత నగదు మాత్రం అలాగే ఉన్నాయని బాధితుడు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa