కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం 60 గజాల కాలనీలో 20 ఏళ్లుగా ఇళ్లపై నుంచి వెళ్తున్న 33. కె. వి విద్యుత్ లైన్ వల్ల స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వర్షాకాలంలో ప్రాణనష్టం కూడా జరుగుతోందని బిజెపి నాయకులు తెలిపారు. ఈ సమస్య పరిష్కారం కోసం మేడ్చల్ మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ను కోరారు. వెంటనే స్పందించిన ఎంపీ, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏ.డి.తో మాట్లాడి, ఎంపీ లాడ్స్ నుండి నిధులు మంజూరు చేసి, ఎస్టిమేషన్ తయారు చేయాలని సూచించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa