ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ఇఫ్తార్ విందుకు ఆహ్వానించారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో మార్చి 15వ తేదీన ఈ విందును ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రిని కలిసి ఆయన వ్యక్తిగతంగా ఆహ్వానం అందించారు.ఈ సందర్భంగా మంత్రి అజారుద్దీన్ స్పందిస్తూ, "గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ పవిత్ర రంజాన్ మాసంలో మార్చి 15న జరిగే ఇఫ్తార్ విందుకు ఆహ్వానించాను. ఈ పవిత్ర సమయం అందరిలో శాంతి, కృతజ్ఞత, ఐక్యతను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను," అని పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa