మంచాల మండలం జపాల్ గ్రామంలో శనివారం కొండిగారి రాములు మాజీ MLA సంతాప సభ గోడ పత్రిక ఆవిష్కరణ జరిగింది. CPI రాష్ట్ర సమితి సభ్యులు ఓరుగంటి యాదయ్య మాట్లాడుతూ, కొండిగారి రాములు అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా నిలబడ్డారని, ప్రజల కష్టాలలో అండగా నిలిచి అసెంబ్లీలో గొంతుక వినిపించారని, వేలాది ఎకరాల భూమిని పేదలకు పంచారని తెలిపారు. మార్చి 31న ఇబ్రహీంపట్నం భరత్ గార్డెన్లో జరిగే సంతాప సభకు పార్టీలకు అతీతంగా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సభకు CPI రాష్ట్ర కార్యదర్శి, MLA కూనంనేని సాంబశివ రావు, MLA మల్ రెడ్డి రంగారెడ్డి, మాజీ MLA కిషన్ రెడ్డి హాజరవుతారని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa