పవిత్ర నాగావళి నదీ తీరాన శ్రీకళ్యాణ తిరుమలలో వేంచేసియున్న శ్రీదేవి దేవి భూదేవి సమేత శ్రీకళ్యాణ వేంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణం సందర్భంగా గురువారం ప్రాతః కాలములో విశేష పూజలు ఆలయ అర్చకులు నిర్వహించారు. సుప్రభాత సేవ, తదుపరి శ్రీవారు, అమ్మవార్లకు క్షీరాభిషేకము, పంచామృతాభిషేకమునిజరూప దర్శనం, నగర వీధుల్లో హరినామ సంకీర్తనలు సామూహిక విష్ణు సహస్రనామ స్తోత్రము కార్యక్రమంలు నిర్వహించారు. నక్షత్ర, కుంభ, నేయి, కర్పూర, నవనీత పంచ హారతులు ఆలయ అర్చకులు బూరాడ. వంశీశర్మ వారిచే జరిపినట్లు నిర్వాహకులు తెలిపారు. భజనాది
కార్యక్రమాలు, చివరిగా పవళింపు సేవతో ముగిసినట్లు కార్యక్రమంలో భక్తులు శ్రీవారి దర్శనానికి విరివిగా పాల్గొన్నట్లు ఆలయ గౌరవ అధ్యక్షలు లోకనాధం. నందికేశ్వరరావు, అధ్యక్ష, కార్యదర్శిలు మర్రి. యోగేశ్వరరావు, బెహరా. నాగేశ్వరరావు, కార్యవర్గ సభ్యులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa