కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి దాదాపు 3 కిలోమీటర్ల మేర భక్తులు నిలుచున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. గురువారం రోజు స్వామివారిని 66,280 మంది భక్తులు దర్శించుకున్నారు. 36,905 మంది తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీకి రూ. 3.29 కోట్ల ఆదాయం వచ్చింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa