ప్రముఖ హాస్పిటాలిటీ సెక్టార్ కంపెనీ ఓయో రూమ్స్ తొలి పబ్లిక్ ఆఫర్ (IPO) విషయంలో వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఐపీఓ కోసం సెబీకి సమర్పించిన దరఖాస్తును ఓయో ఉపసంహరించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కంపెనీ రీఫైనాన్సింగ్ ప్రణాళికను ఖరారు చేసే పనిలో ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ రీఫైనాన్సింగ్ ప్రక్రియ పూర్తయ్యాక తిరిగి ఐపీఓకు దరఖాస్తు చేసే యోచనలో ఉన్నట్లు పేర్కొన్నాయి.
'రీ ఫైనాన్సింగ్ ప్రక్రియ వల్ల కంపెనీ ఆర్థిక వివరాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ మార్పులను అనుసరించి నిబంధనల ప్రకారం సెబీకి సవరించిన ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (Initial Public Offering) దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కంపెనీ రీఫైనాన్సింగ్ కు సంబంధించి నిర్ణయం చివరి దశలో ఉంది. ఈ క్రమంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివరాలతోనే ఐపీఓకు దరఖాస్తు ఆమోదం కోసం ప్రయత్నించడంలో ఎలాంటి అర్థం లేదు.' అని ఓయో రూమ్స్ వర్గాలు తెలిపినట్లు జాతీయ మీడియాల్లో పలు కథనాలు వెలువడ్డాయి.
అంతర్జాతీయ ట్రావెల్ టెక్నాలజీలో అగ్రగామిగా ఉన్న సాఫ్ట్ బ్యాంక్ ఆధారిత ఓయో డాలర్ బాండ్ల జారీ ద్వారా 450 మిలియన్ డాలర్ల సమకూర్చుకునే రీఫైనాన్సింగ్ ప్లాన్ లకు చేరువుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇన్వెస్టర్లు ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఐపీఓను రీఫైల్ చేయాలని ఓయో రూమ్స్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఓయో రీఫైనాన్సింక్ ప్రక్రియకు జేపీ మోర్గాన్ లీడ్ బ్యాంకర్ గా వ్యవహరిస్తోంది. వార్షిక వడ్డీ రేటు 9- 10 శాతంతో డాలర్ బాండ్లను విక్రయించనుందని పీటీఐ పేర్కొంది. ఈ క్రమంలోనే ఓయో తన ప్రస్తుత డిఆర్ హెచ్ పీ ని రీఫైనాన్సింగ్ కు ముందుగానే ఉపసంహరించుకోవడానికి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఓయో మాతృ సంస్థ ఓరావెల్ స్టేస్ లిమిటెడ్ నవంబర్లో బైబ్యాక్ ప్రక్రియ ద్వారా దాని రుణం భారంలో గణనీయమైన భాగాన్ని ప్రీపెయిడ్ చేసింది. మొత్తం రూ. 1,620 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. 660 మిలియన్ల డాలర్ల టర్మ్ లోన్ లో 30 శాతం బైబ్యాక్లో భాగంగా తిరిగి కొనుగోలు చేసింది. బకాయి బ్యాలెన్స్ సుమారు 450 మిలియన్లకు తగ్గించినట్లు పీటీఐ పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa