ఈనెల మూడోతేదీ నుంచి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి. శనిదేవుడు ఈనెల 15వ తేదీన ధనిష్ట నక్షత్రంలోకి అడుగు పెడుతున్నాడు. దీనికితోడు బృహస్పతి వృషభరాశిలో 12 సంవత్సరాల తర్వాత తిరోగమనంలో ఉండటంతోపాటు ప్రధానమైగన గ్రహాల సంచారం కూడా ఉంది.ఈ పరిణామాలన్నీ నాలుగు రాశులవారికి తిరుగులేని అదృష్టాన్ని కలగజేస్తున్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఈ ప్రభావంలో కొన్ని రాశులు ఆర్థిక ప్రయోజనాలను పొందనున్నాయి. వాటి వివరాలను తెలుసుకుందాం.
ధనుస్సు
శత్రువులపై విజయాలు సాధించడంతోపాటు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. వృషభరాశిలో గురువు తిరోగమనంలో ఉండటంవల్ల వీరికి అనేక విజయాలు సొంతమవుతాయి. కొత్తగా వాహనాన్ని కొనుగోలు చేస్తారు. పెళ్లి కోసం చేస్తున్న ప్రయత్నాలు విజయవంతమవుతాయి. బ్యాంకులో డబ్బులు పెరుగుతాయి.
వృషభ రాశి
ఆర్థిక ప్రయోజనాలు కలుగుతున్నాయి. దీనివల్ల వీరిలో ఆత్మవిశ్వాసం పెరిగి అన్ని పనులను పూర్తిచేయగలుగుతారు. వివాహం కానివారికి పెళ్లి కుదురుతుంది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. ఇతర ప్రాంతాలకు విస్తరిస్తారు. కెరీర్ పరంగా మంచి పేరు ప్రఖ్యాతులు గడిస్తారు.
మిథున రాశి
అదృష్టం వీరికి ఫెవికాల్ లా అతుక్కుంటుంది. డబ్బును పొదుపు చేయడంపై దృష్టిసారించాలి. ఆర్థికంగా మంచి లాభాలున్నాయి. కొత్తగా ఉద్యోగం చేరే అవకాశంతోపాటు విదేశీ యోగం ఉంది. గతంలో మొదలై నిలిచిపోయిన పనులు ఈ సమయంలోనే పూర్తవుతాయి.
మేషరాశి
వాస్తవానికి శనికి ఈ రాశి అంత అనుకూలం కాదు. కాకపోతే బృహస్పతి తిరోగమనంలో ఉండటంవల్ల పలు సమస్యల నుంచి సులువుగా బయటపడతారు. ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. మాటతీరు ఆధారంగానే మీకు డబ్బులు వస్తాయి. అన్నిరకాలుగా వీరికి కలిసివస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa