ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌లోకి ఐఫోన్‌ SE 4.. నెలాఖరున విక్రయాలు!

Technology |  Suryaa Desk  | Published : Fri, Feb 07, 2025, 03:57 PM

సాధారణంగా ఐఫోన్‌లంటే ఖరీదు ఎక్కువ. అలా పెద్దమొత్తం పెట్టి కొనలేని వారికోసం ఎస్‌ఈ (SE) మోడళ్లను యాపిల్‌ తీసుకొస్తూ ఉంటుంది. అలా 2016 నుంచి (2020, 2022) ఇప్పటివరకు మూడు మోడళ్లను తీసుకొచ్చింది. తాజాగా తదుపరి తరం ఐఫోన్‌ ఎస్‌ఈ (iPhone SE 4 ) మోడల్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోందని ‘బ్లూమ్‌బెర్గ్‌’ పేర్కొంది. వచ్చేవారమే దీన్ని విడుదల చేయనుందని సమాచారం. ఈ నెలాఖరులో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.ఐఫోన్‌ ఎస్‌ఈ 3ని 2022లో యాపిల్‌ లాంచ్ చేసింది. ‘పీక్‌ పర్ఫార్మెన్స్‌’ అనే ఈవెంట్‌లో యాపిల్‌ దీన్ని విడుదల చేసింది. అయితే కొత్త ఎస్‌ఈ 4ను ఎలాంటి ఈవెంట్‌ నిర్వహించకుండా.. నేరుగా వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తేనున్నట్లు తెలుస్తోంది. అమెరికాతో పాటు భారత్‌లోనూ వెబ్‌సైట్‌ ద్వారా విక్రయాలు జరపనున్నట్లు సమాచారం. గత ఎస్‌ఈ మోడల్‌ ధరను కంపెనీ రూ.43,900గా నిర్ణయించింది. ఎస్‌ఈ 4 దీనికంటే ఎక్కువ ధర ఉండే అవకాశం ఉందని టెక్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఇక ఫీచర్ల విషయానికొస్తే.. కొత్త ఎస్‌ఈ మోడల్‌ ఐఫోన్‌ 14ను పోలి ఉండనుంది. అంటే తొలిసారి హోమ్‌ బటన్‌, టచ్‌ ఐడీ లేకుండా ఈ స్పెషల్‌ ఐడీ రానుందని తెలుస్తోంది. దాని బదులు గెశ్చర్‌ నావిగేషన్‌, ఫేస్‌ ఐడీ ఉండబోతోంది. అలాగే, యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌తో యాపిల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్లతో ఈ ఫోన్‌ రానుంది. ఐఫోన్‌ 16లో వాడిన ఏ18 చిప్‌ను ఇందులో వాడుతున్నట్లు తెలుస్తోంది. 6.1 అంగుళాల ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉండబోతోంది. అంటే ఎస్‌ఈ 3తో పోలిస్తే (4.7 అంగుళాలు) సైజ్‌ పరంగా కూడా కొత్త మోడల్‌ పెద్దగా ఉండబోతోంది. దీని విడుదల సమయంలో మరిన్ని వివరాలు తెలియరానున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com