గతేడాది వెస్టిండీస్ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచి 11 ఏళ్ల ఐసీసీ టైటిల్ నిరీక్షణకు తెరదించిన భారత క్రికెట్ జట్టుకు బీసీసీఐ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చింది. అమెరికాలోని స్పోర్ట్ లీగ్స్ ఎన్బీఏ, ఎన్ఎఫ్ఎల్ వంటి వాటిని ఆదర్శంగా తీసుకుని.. ప్రత్యేక ఉంగరాలని ఆటగాళ్లకు బహుమతిగా ఇచ్చింది. ఈ మేరకు గత వారం ముంబైలో జరిగిన నమన్ అవార్డుల ప్రదానోత్సవంలో బీసీసీఐ.. భారత ఆటగాళ్లను ఛాంపియన్స్ రింగ్తో సత్కరించింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
ఛాంపియన్స్ రింగ్ ప్రత్యేకతలివే..!
బీసీసీఐ అందజేసిన ఛాంపియన్స్ రింగ్ను వజ్రాలు, బంగారంతో తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ కస్టమైజ్డ్ రింగ్పై టీ20 ప్రపంచకప్ 2024 ఛాంపియన్ ఇండియా.. అనే అక్షరాలు కనిపించాయి. ఉంగరానికి ఓ పక్క ఆటగాళ్ల జెర్సీ నంబర్.. మరో పక్క వారి పేర్లను రాశారు. అన్నింటికంటే ముఖ్యంగా ఉంగరం పైభాగంలో ఆశోకచక్రాన్ని పొందుపరిచారు. ఇక ఈ టోర్నీలో భారత్ సాధించిన విజయాలకు సంబంధించిన విషయాలను సైతం.. ఉంగరంపై అక్షరాల రూపంలో ఉంచారు.
నమన్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న టీ20 ప్రపంచకప్ 2024 విన్నింగ్ జట్టులోని సభ్యులందరికీ ఈ ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చారు. ఇందులో రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా లాంటి ప్లేయర్లు ఉన్నారు. రంజీ మ్యాచ్ ఉన్నందున విరాట్ కోహ్లీ ఈ వేడుకకు హాజరుకాలేదు. అయితే అతడికి కూడా ఈ ప్రత్యేక గిఫ్ట్ను పంపించారు.
ఇక ఈ తరహా ప్రత్యేక రింగ్ను గిఫ్ట్గా ఇవ్వడం అమెరికన్ స్పోర్ట్ల్ లీగ్స్లో ఉంటుంది. ఎన్బీఏ, ఎన్ఎఫ్ఎల్ వంటి వాటిలో విజేతలకు ఈ తరహా ఛాంపియన్ రింగ్లు అందజేసేస్తారు. సుమారు 75 ఏళ్లుగా అక్కడ ఈ సంప్రదాయం కొనసాగుతోంది. తాజాగా బీసీసీఐ కూడా ఈ వినూత్న కార్యక్రమాన్ని క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసింది. కాగా గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ టైటిల్ సాధించింది. వరుసగా 9 మ్యాచ్లలో గెలిచి.. ఈ ఫీట్ సాధించింది. ఫైనల్లో దక్షిణాఫ్రికాను 7 పరుగుల తేడాతో ఓడించి.. 11 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని ముద్దాడించింది.
![]() |
![]() |