మార్చి 22 నుంచి ఐపీఎల్ 2025 ప్రారంభంకానుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్-ఆర్సీబీ మధ్య కోల్కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. రెండో మ్యాచ్ ఐపీఎల్ 2024 రన్నర్స్ సన్రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మార్చి 23 మధ్యాహ్నం హైదరాబాద్ రాజీవ్గాంధీ స్టేడియంలో జరగనుంది. ఇప్పటికే ఐపీఎల్ షెడ్యూల్ పూర్తయినా అధికారికంగా ఇంకా ప్రకటన చేయలేదు. కొద్ది రోజుల్లోనే ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ విడుదల కానుంది.
ఐపీఎల్ 2025 పూర్తి షెడ్యూల్ను ఇంకా ప్రకటించకపోయినా కీలకమైన అప్డేట్స్ మాత్రం వచ్చాయి. కీలక ఆటగాళ్లంతా ఫ్రాంచైజీలు మారడంతో ఈ ఏడాది ఐపీఎల్ మరింత ఆసక్తిగా మారనుంది. హైదరాబాద్ వేదికగా కీలక మ్యాచ్లు జరగనుండగా.. ఫైనల్స్కు మాత్రం కోల్కతా ఈడెన్ గార్డెన్స్ వేదికైంది.
మార్చి 22 నుంచి ఐపీఎల్ 2025 ప్రారంభంకానుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్-ఆర్సీబీ మధ్య కోల్కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. రెండో మ్యాచ్ ఐపీఎల్ 2024 రన్నర్స్ సన్రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మార్చి 23 మధ్యాహ్నం హైదరాబాద్ రాజీవ్గాంధీ స్టేడియం (ఉప్పల్)లో జరగనుంది. ఇప్పటికే ఐపీఎల్ షెడ్యూల్ పూర్తయినా అధికారికంగా ఇంకా ప్రకటన చేయలేదు. కొద్ది రోజుల్లోనే ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ విడుదల కానుంది.
ఐపీఎల్ ఆనవాయితీ ప్రకారం ఈ ఏడాది ఫైనల్స్ ఐపీఎల్ 2024 ఛాంపియన్స్ హోం గ్రౌండ్ కోల్కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగానే మే 25న జరగనుంది. క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్ మ్యాచ్లు హైదరాబాద్ రాజీవ్గాంధీ స్టేడియం వేదికగా జరగనున్నాయి. క్వాలిఫైయర్ 2, ఫైనల్స్కి కోల్కతా వేదిక కానుంది.
అత్యధిక ధర పలికిన ఆటగాళ్లు
ఐపీఎల్ మెగావేలంలో అన్ని ఫ్రాంచైజీలు తమ కీలక ప్లేయర్లను బయటకు వదిలేయడంతో రికార్డు స్థాయిలో వేలం జరిగింది. ఐపీఎల్ 2025 కాస్ట్లీ ఆటగాడిగా రిషబ్ పంత్ నిలిచాడు. పంత్ను లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంచైజీ రూ.27 కోట్లకు సొంతం చేసుకుంది. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ను రూ.26.75 కోట్లకు పంజాబ్ కింగ్స్ దక్కించుకోగా, వెంకటేశ్ అయ్యర్ను కేకేఆర్ రూ.23.75 కోట్లకు రిటైన్ చేసుకుంది. అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ను పంజాబ్ కింగ్స్ రూ.18 కోట్లకు కొనుగోలు చేసింది. జోస్ బట్లర్ రూ.15.75 కోట్లు, కేఎల్ రాహుల్ రూ.14 కోట్లు, ట్రెంట్ బౌల్ట్ రూ.12.5 కోట్లు, జోఫ్రా ఆర్చర్ రూ.12.5 కోట్లు, హేజెల్వుడ్ రూ.12.5 కోట్ల ధర పలికారు. కెప్టెన్లను కూడా కొన్ని ఫ్రాంచైజీలు వేలంలోకి వదిలేయడంతో వేలంలో భారీ పోటీ నడిచింది.
అన్ని జట్ల కెప్టెన్లు
చెన్నై సూపర్ కింగ్స్ - రుతురాజ్ గైక్వాడ్, గుజరాత్ టైటాన్స్-శుభమన్ గిల్, ముంబయి ఇండియన్స్-హార్దిక్ పాండ్యా, పంజాబ్ కింగ్స్-శ్రేయాస్ అయ్యర్, రాజస్థాన్ రాయల్స్-సంజూ శాంసన్, సన్రైజర్స్ హైదరాబాద్-పాట్ కమిన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-రజత్ పటీదార్, లక్నో సూపర్ జెయింట్స్-రిషబ్ పంత్. కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ఇప్పటి వరకు తమ కెప్టెన్లను ప్రకటించలేదు. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ సీజన్లో అన్క్యాప్డ్ ప్లేయర్గా బరిలో దిగనున్నాడు.
![]() |
![]() |