టీమిండియా లెజెండ్స్ మహేంద్ర సింగ్ ధోనీ, సురేష్ రైనా, రిషబ్ పంత్ ఒకే ఫ్రేమ్లో అది కూడా ఫుల్ చిల్ అవుతూ డాన్స్ చేస్తున్నారు. గ్రూప్ డాన్స్ చేస్తూ జిల్జిల్ జిగా జిగా అంటూ ఎంజాయ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అసలు వీడియో ఎక్కడిది? ఎప్పుడిది? వీళ్లంతా ఎప్పుడు కలిశారు అని అనుకుంటున్నారా?
టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ, స్టార్ బ్యాటర్ సురేష్ రైనా కలిసి రిషబ్ పంత్ చెల్లి పెళ్లికి హాజరయ్యారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముగిసిన అనంతరం రిషబ్ పంత్ నేరుగా ఉత్తరాఖండ్లోని ముస్సోరిలో జరుగుతున్న తన చెల్లి పెళ్లికి హాజరయ్యాడు. ఈ వేడుకకు టీమిండియా క్రికెటర్లను, తన క్లోజ్ ఫ్రెండ్స్ను కూడా పంత్ ఆహ్వానించాడు. ఐపీఎల్ అన్సోల్డ్ ప్లేయర్ పృథ్వీ షా కూడా ఈ ఫంక్షన్ కోసం ముస్సోరికి వచ్చాడు.
రిషబ్ పంత్ సిస్టర్ సాక్షి పంత్కు గతేడాది జనవరిలో అంకిత్తో నిశ్చితార్థం అయింది. ఈ ఏడాది మార్చిలో వివాహం జరగనుండటంతో పెళ్లికి ముందు హల్దీ, మెహందీ, సంగీత్ ఫంక్షన్లను అట్టహాసంగా నిర్వహించారు. ఈ ఫంక్షన్లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సాక్షి పంత్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది.
పంత్ ఆహ్వానం మేరకు మహేంద్ర సింగ్ ధోనీ, సురేష్ రైనా ఇద్దరూ తమ తమ భార్యలతో సంగీత్కు విచ్చేశారు. తనకు ఎంతో ఇష్టమైన ధోనీ రావడంతో రిషబ్ పంత్ అతనితో కలిసి సంగీత్లో చిందులేస్తూ ఫుల్ చిల్ అయ్యాడు. పంత్, రైనా, ధోనీతో పాటు మరో నలుగురు ఫ్రెండ్స్తో కలిసి గ్రూప్ డాన్స్ వేశారు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది.
ఐపీఎల్ 2025 మరో పది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో చెన్నైకి వచ్చే ముందు ఎంఎస్ ధోనీ రిషబ్ పంత్ చెల్లి పెళ్లికి హాజరయ్యాడు. ఆ వేడుక ముగియగానే నేరుగా చెన్నైలోని సీఎస్కే స్క్వాడ్తో జాయిన్ అవుతాడు. రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో ఈ ఏడాది ధోనీ సీఎస్కేలో ఆడనున్నాడు. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ 23వ తేదీ ముంబై ఇండియన్స్తో కలిసి తన తొలి మ్యాచ్లో తలపడనుంది. ముంబైతో రెండు, ఆర్సీబీతో రెండు మ్యాచ్లు ఆడనుండటంతో ఫ్యాన్స్ ఐపీఎల్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
![]() |
![]() |