ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమరావతి పునర్నిర్మాణ పనులకు మోడీకి ఆహ్వానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 15, 2025, 10:22 AM

రాజధాని అమరావతి పనులకు ఏప్రిల్‌ మూడు, నాలుగు వారాల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపన చేసే అవకాశముందని తెలుస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లినప్పుడు అమరావతికి రావాల్సిందిగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పునర్నిర్మాణ కార్యక్రమ పర్యటనకు మోదీ తప్పకుండా వస్తారని చెబుతున్నారు. అయితే, ఇంతవరకు ఎవరూ ధ్రువీకరించలేదు. విభజన తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చాక 2015, అక్టోబరు 22న అమరావతి పనులకు మోదీ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత హైకోర్టు, సచివాలయం, అసెంబ్లీ, శాసనమండలి, డీజీపీ కార్యాలయాలను ప్రభుత్వం పూర్తిచేసింది. అయితే, వైసీపీ ప్రభుత్వం రావడంతో అమరావతి విధ్వంసం జరగడమే కాకుండా, రాజధానిని అటకెక్కించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com