ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ సోమవారం ఢిల్లీలో సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఇరు దేశాల మధ్య ఒప్పందాల మార్పిడిని వీక్షించారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ముంబయి ఉగ్రదాడులు, క్రిస్ట్ చర్చిపై దాడి అంశాల్లో భారత వైఖరి స్పష్టమని చెప్పారు. ఉగ్రవాదం, వేర్పాటువాదాన్ని కట్టడి చేసేందుకు న్యూజిలాండ్తో కలిసి పనిచేస్తామని తెలిపారు.రక్షణ రంగంలో రెండు దేశాల మధ్య సహకారాన్ని కొనసాగించే దిశగా ఒక ఒప్పందంపై సంతకాలు చేశాయి. అలాగే పరస్పర ప్రయోజనకరమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు ప్రారంభించాలని నిర్ణయించుకున్నాయి. ఈ అగ్రిమెంట్తో ఇరుదేశాలకు ఉపయోగపడే రీతిలో వాణిజ్య సామర్థ్యం పెరుగుతుందని, పాడిపరిశ్రమ, ఫుడ్ ప్రాసెసింగ్, ఫార్మా వంటి రంగాల్లో పెట్టుబడులకు ప్రోత్సాహం లభిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశాయి. తాము అభివృద్ధివాదాన్ని కోరుకుంటున్నామని, విస్తరణవాదాన్ని కాదని ఇరు దేశాలు వెల్లడించాయి. 2019లో క్రైస్ట్చర్చ్ నగరంలోని మసీదుపై జరిగిన ఉగ్రదాడి ఘటనలో 51 మంది ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. దీనినే మోదీ ప్రస్తావించారు.
![]() |
![]() |