ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హత్యకు గురైన మహిళ 18 నెలలకు తిరిగొచ్చింది.. జైల్లోనే నిందితులు

national |  Suryaa Desk  | Published : Sat, Mar 22, 2025, 07:43 PM

18 నెలల క్రితం హత్యకు గురైన ఓ మహిళ.. ఉన్నట్టుండి హఠాత్తుగా ఇంటికి వచ్చింది. తామే దగ్గరుండి అంత్యక్రియలు చేసిన కుటుంబ సభ్యులు ఆమె తిరిగి రావడం చూసి షాక్ అయ్యారు. అసలు ఆమె నిజంగానే మనిషా లేక దెయ్యమా అని పదే పదే ఆమెను తాకి చూశారు. నిజంగా మనిషనే తెలుసుకుని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎందుకంటే ఆమెను చంపేశారనే ఆరోపణలతో నలుగురు వ్యక్తులు జైల్లో శిక్షను అనుభవిస్తున్నారు. మరి ఆపై ఏం జరిగిందో తెలియాలంటే మీరీ స్టోరీ చదివేయాల్సిందే.


మధ్య ప్రదేశ్‌లోని మందసౌర్ జిల్లా గాంధీ సాగర్‌కు చెందిన 35 ఏళ్ల లిలితా బాయి 2023 సెప్టెంబర్ నెలలో కనిపించకుండా పోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆపై చాలా చోట్ల కూడా వెతికారు. కానీ ఎలాంటి ఉపయోగమూ లేదు. అయితే ఓరోజు పోలీసులు.. ముఖం చిద్రమైన మహిళ మృతదేహాన్ని గుర్తించి... లలిత కుటుంబానికి పోలీసులు చూపించారు. చేతిపై పచ్చబొట్టు, కాలికి నల్లటి దారం వంటి ఉండడంతో రమేష్ బాంచాడా చనిపోయింది తన కూతురే అని చెప్పారు. నిజంగానే చనిపోయిందని భావించి అంత్యక్రియలు కూడా నిర్వహించారు.


అయితే సదరు మహిళను హత్య చేసిన కేసులో నలుగులు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అయితే ఇమ్రాన్, షారుక్, సోనూ, ఎజాబ్‌ను పోలీసులు అందుపులోకి తీసుకోగా.. కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించారు. అయితే ఊహించని విధంగా రెండు రోజుల కిందట లలితా బాయి తన ఇంటికి తిరిగి వచ్చింది. అది చూసి షాక్ అయిన కుటుంబ సభ్యులు నువ్వు నిజంగానే లలితా బాయివా అని అడిగారు. పదే పదే ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఆమెను చంపిన కేసులో నలుగురు జైల్లో ఉండగా.. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు ఫోన్ చేశారు.


హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు ఆమె వద్దకు వచ్చి.. మీరెవరు, ఇప్పుడెక్కడి నుంచి వచ్చారంటూ అడిగారు. ఈక్రమంలోనే లలితా బాయిని పోలీసులు ప్రశ్నించగా.. తెలిసిన వ్యక్తి తనను మోసం చేసి 5 లక్షల రూపాయలు అమ్మేశాడని చెప్పింది. ఇన్ని రోజులుగా బందీగా ఉన్నానని.. అవకాశం దొరకడంతో వారి చెర నుంచి బయట పడి ఇంటికి తిరిగొచ్చనని వివరించింది. అదంతా విన్న పోలీసులు పైఅధికారులకు విషయం తెలిపారు. అసలు హత్యకు గురైన మహిళ ఎవరు, ఆమెను చంపింది తాము జైల్లో వేసిన వారేనా కాదా అని తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com