ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు తొలి మ్యాచ్ ఆడే డిఫెండింగ్ ఛాంపియన్స్ తమ మార్క్ చూయించేందుకు చాలా రోజులు ముందుగానే ప్రాక్టీస్ మొదలుపెట్టింది. ప్రతి రోజూ హోటల్ నుంచి గ్రౌండ్కి బస్సులో వెళ్లి రావాల్సి ఉంటుంది. ఎప్పటిలాగే ప్రాక్టీస్కు వెళ్తున్న సమయంలో ఓ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది.
కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే హోటల్లో ఉన్న సమయంలోనే ఆ జట్టు బస్ ప్రాక్టీస్కు స్టార్ట్ అయింది. అయితే ఆ విషయం తెలుసుకున్న రహానే హోటల్ రూమ్ నుంచి హడావుడిగా బయటకు వచ్చాడు. బస్ స్టార్ట్ అవ్వడంతో హోటల్లో పరిగెడుతూ బయటకు వెళ్లాడు. అక్కడ ఉన్న అభిమానులు ఆటోగ్రాఫ్ అన్నా వినిపించుకోకుండా రన్నింగ్ చేశాడు. రహానేతో పాటు హోటల్ స్టాఫ్ కూడా అతనితో పాటు పరిగెత్తారు.
ఈ వీడియోను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అసలు కెప్టెన్ లేకుండా బస్ అలా ఎలా స్టార్ట్ అయిందంటూ పోస్ట్ కింద కామెంట్స్ చేస్తున్నారు. అప్పట్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఇలానే లేట్గా రావడం, మరచిపోవడం లాంటివి చేసేవాడు. కానీ ఇప్పుడు ఏకంగా కెప్టెన్ లేకుండానే టీమ్ బస్సు కదిలింది.
ఐపీఎల్ 2025 ఆరంభ మ్యాచ్ కోల్కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్, ఆర్సీబీ మధ్య జరగనుంది. మార్చి 22 రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే తొలి మ్యాచ్కి వరుణుడి అడ్డంకి ఉండటంతో మ్యాచ్ స్టార్ట్ అయ్యే వరకూ క్లారిటీ లేదు. మ్యాచ్కి ఒక్క రోజు ముందు కూడా కోల్కతాలో వర్షం పడటంతో గ్రౌండ్ మొత్తాన్ని స్టాఫ్ పట్టలతో కప్పేశారు. డ్రైనేజీ సిస్టం కూడా క్లియర్గా ఉందని, ఈరోజు ఎలాంటి వర్షం లేకుండా ఉంటే మ్యాచ్ సజావుగా సాగే అవకాశం ఉందని గ్రౌండ్ నిర్వాహకులు చెబుతున్నారు.
మ్యాచ్ ముందు రోజు వర్షం పడటంతో ఇరు జట్లు ప్రాక్టీస్కు వెళ్లి మరీ వెనక్కి తిరిగొచ్చారు. హోటల్స్ నుంచి బయల్దేరిన ఇరు జట్ల బస్లు గ్రౌండ్లోకి వెళ్లకుండానే వెనక్కి తిరిగొచ్చాయి. మరి ఈ రోజు మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనేది వరుణుడి మీదే ఆధారపడి ఉంది.
![]() |
![]() |