ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 23, 2025, 08:44 PM

పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ ప్రజలకు స్థానిక టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఓ మోస్తరు హెచ్చరిక జారీ చేశారు. ఉండి నియోజకవర్గంలో ఎవరైనా పంట కాలువల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇతర చెత్తను వేస్తే వారికి రూ.1000 జరిమానా విధించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాలనే సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామని రఘురామ వెల్లడించారు. ఈ జరిమానా ద్వారా వచ్చిన మొత్తాన్ని కెనాల్ డెవలప్ మెంట్ ఫండ్ (కాలువ అభివృద్ధి నిధి)కి జమ చేసి, పంట కాలువలను శుభ్రం చేసేందుకు వినియోగిస్తామని తెలిపారు. అయితే, జరిమానా కట్టే పరిస్థితి రాకుండా ప్రజలందరూ కాలువలను శుభ్రంగా ఉంచుతారని ఆశిస్తున్నానని రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com