హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో.. ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మార్చి 26వ తేదీన తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాదం చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం హైవేపై జరిగింది. ఈ ఘటనలో వెనక నుంచి మరో ట్రావెల్స్ బస్సు ఆరెంజ్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో 13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.
![]() |
![]() |