ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పునర్విభజనపై కేంద్రం తొందరపాటు: డింపుల్ యాదవ్ ప్రశ్నలు

national |  Suryaa Desk  | Published : Thu, Apr 16, 2026, 12:19 PM

నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం తొందరపాటు వెనుకగల వ్యూహం ఏమిటని సమాజ్‌వాది పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ ప్రశ్నించారు. గతంలో మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపేటప్పుడు, ముందుగా జనగణన, ఆ తర్వాత పునర్విభజన చేపడతామని కేంద్రం చెప్పిందని ఆమె గుర్తుచేశారు. జనగణన జరగకుండానే పునర్విభజనకు కేంద్రం ఎందుకు తహతహలాడుతుందో అర్థం కావడంలేదన్నారు. 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మోదీ సర్కారు పునర్విభజనకు ఉవ్విళ్లూరుతోందని విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa