ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మనుషుల్లేని ప్రాంతాలపై కూడా ట్రంప్ సుంకాలు

international |  Suryaa Desk  | Published : Thu, Apr 03, 2025, 09:26 PM

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్ పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి షాకింగ్ నిర్ణయాలు తీసుకుంటూ అనేక దేశాలను భయపెట్టిస్తున్నారు. మొన్నటి వరకు అక్రమ వలసదారులను పంపిస్తూ ఆయా దేశాలను ఇబ్బంది పెట్టిన ఆయన.. తాజాగా ప్రతీకార సుంకాలు విధిస్తూ మరింత టెన్షన్ పెడుతున్నారు. ముఖ్యంగా బుధువారం రోజు ఏయే దేశాలపై ఎంత టారిఫ్ విధిస్తున్నారో చెప్పగా.. ఓ షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. మనుషులు ఉండే ప్రాంతాలపైనే కాకుండా.. జనావాసాలు లేని ప్రాంతాలపై కూడా ట్రంప్ టారిఫ్ విధిస్తున్నట్లు వెల్లడి అయింది. కేవలం పక్షులు, పెంగ్విన్లు మాత్రమే నివాసం ఉండే అంటార్కిటికా దీవులపై ఆయన టారిఫ్ ప్రకటించారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


ఏప్రిల్ 2వ తేదీ బుధవారం రోజు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనేక దేశాలపై టారిఫ్ విధించబోతున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా వెలుపల ఉన్న హర్డ్, మెక్ డొనాల్డ్ దీవులపై కూడా 10 శాతం సుంకాలు విధించారు. ఈ దీవులను చేరుకోవడానికి ఆస్ట్రేలియా ప్రధాన భూభాగం నుంచి రెండు వారాల సమయం పుడతుంది. ఒక దశాబ్ద కాలంగా అక్కడికి ఏ ఒక్క మనిషి కూడా వెళ్లలేడు. ఎక్కువగా అగ్ని పర్వతాలు ఉండే ఈ ప్రాంతాల్లో శాశ్వత జనావాసం ఉండదు. కేవలం ఇక్కడ సీల్స్, పెంగ్విన్లు, ఇతర పక్షలు మాత్రమే ఆవాసం ఉంటాయి. దీనిపై 10 శాతం టారిఫ్ విధించడంతో ఆ దేశ ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు.


ముఖ్యంగా ట్రంప్ చర్య సరికాదంటూనే.. ఆ దేశ ప్రధాని ఆంథోని అల్బనీస్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అసలు ట్రంప్ సుంకాల నుంచి భూమిపై ఎక్కడా రక్షణ లేదని ఆరోపించారు. ఇది ఒక స్నేహితుడు చేసే పని అస్సలే కాదన్నారు. అలాగే తమపై ట్రంప్ సుంకాలు విధించాడని.. ప్రతిగా ఆ దేశంపై తామేమీ పగ తీర్చుకోమని, అస్సలే యూఎస్ దిగుమతులపై పరస్పర సుంకాలు విధించబోమని స్పష్టం చేశారు. అయితే దీనిపై స్పందించిన వైట్‌హౌస్ ఆస్ట్రేలియన్ భూభాగంలోని దీవులు కాబట్టే వాటిపై సుంకాలు విధించినట్లు తెలిపింది.


ఇది మాత్రమే కాకుండా ట్రప్ ఆర్కిటిక్ మహా సముద్రంలోని అగ్ని పర్వత ద్వీప్ జాన్ మాయెన్‌పై కూడా 10 శాతం సుంకం విధించారు. అయితే ఇది నార్వేలోని టోమ్సోకు ఉత్తరం వైపున ఉంటుంది. ముఖ్యంగా 580 మైల్లో దూరంలో ఉన్న ఈ దీవుల్లో కూడా జనావాసాలు ఉండవు. కానీ పర్యాటకులకు అనుమతి ఉంటుంది. కేవలం ధ్రువపు ఎలుగు బంట్లు మాత్రమే అక్కడ ఆవాసం ఉంటుండగా.. ట్రంప్ 10 శాతం సుంకాలు విధించడంతో నావ్రే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈక్రమంలోనే ఆ దేశం కూడా అమెరికా ప్రతీకార సుంకంగా 15 శాతం టారిఫ్ విధించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com