ప్రముఖ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు గుడ్న్యూస్ చెప్పింది. ఇంటి రుణాలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అధిక సిబిల్ స్కోర్ ఉన్న రుణగ్రహీతలకు ఏడాదికి వడ్డీని 8.10 నుంచి 7.90 శాతానికి తగ్గించింది.
ఇవి ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే ఈ రుణ రేట్లు కొత్తగా రుణాలు తీసుకునేవారికి కూడా వర్తిస్తాయని పేర్కొంది. ఇటీవల ఆర్బీఐ రెపో రేటును తగ్గించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.
![]() |
![]() |