పహల్గాం ఉగ్రదాడిలో తెలుగు ప్రజల మృతిపై వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్ మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. పర్యాటకులను దారుణంగా కాల్చి చంపడం అమానవీయ చర్య అన్నారు. ఉగ్రదాడిలో విశాఖ, కావలికి చెందిన చంద్రమౌలి, మధుసూదన్ మరణించడం బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలకు కేంద్రం అండగా నిలవాలని వైయస్ జగన్ విజ్ఞప్తి చేశారు. అనంత్నాగ్ జిల్లా పహల్గాంలోని బైసరన్ లోయ మైదానాల్లో మంగళవారం మధ్యాహ్నాం సైనికుల దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపిన ఘటనను ఖండిస్తూ ఇవాళ సాయంత్రం అన్ని జిల్లా కేంద్రాల్లో క్యాండిల్ ర్యాలీలు నిర్వహించాలని వైయస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శాంతియుతంగా ర్యాలీలు నిర్వహించాలని అధినేత ఆదేశించారు.
![]() |
![]() |