ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికా కోసమే ఉగ్రవాదులను పెంచి పోషించాం: పాకిస్థాన్

international |  Suryaa Desk  | Published : Fri, Apr 25, 2025, 10:28 PM

పాకిస్థాన్ అంటేనే ఉగ్రవాద దేశం, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశం, ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చి, దాడులకు ఉసిగొల్పే దేశం. ఈ విషయం ప్రపంచం మొత్తానికి తెలుసు. అన్ని దేశాలకు తెలుసన్న విషయం పాకిస్థాన్‌కు కూడా తెలుసు. కానీ ఉగ్రవాదం అంటే ఏంటో కూడా తమకు తెలియదు అన్నట్లుగా వ్యవహరిస్తూ వచ్చింది ఇన్ని రోజులు. లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఇంకోటి చెబుతుంటుంది. కానీ మనసులో ఉన్న మాట అప్పుడప్పుడు బయట పడుతూనే ఉంటుంది. ఇలా తాజాగా నోరు జారిన పాక్ సంచలన వాస్తవాలను బయటపెట్టింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.


తమ గడ్డపై ఉగ్రవాదులే లేరంటూ గత కొన్నేళ్లుగా చెప్పుకుంటూ వస్తున్న పాకిస్థాన్.. తాజాగా తమ దేశ రక్షణ మంత్రి వ్యాఖ్యలతో ఇరకాటంలో పడింది. ఉగ్ర సంస్థలకు నిధులు, ఉగ్రవాదులకు శిక్షణ నిజమేనంటూ స్వయంగా ఆ దేశ రక్షణ మంత్రే ఒప్పుకున్నారు. అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు పాక్ నీచ బుద్ధిని మరోసారి బయట పెట్టాయి. పహల్గాం దాడి తర్వాత భారత్‌తో నెలకొన్న ఉద్రిక్తతలపై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ 'స్కై న్యూస్'కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఉగ్ర సంస్థలకు నిధులు సమీకరించడం, ఉగ్రవాదులకు శిక్షణ ఇవ్వండి, ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం వంటివి పాక్ చాలా కాలంగా చేస్తోంది దీనిపై మీ స్పందన ఏమిటి అని జర్నలిస్టు ప్రశ్నించారు.


ఆ పశ్చిమ దేశాల కోసమే 30 ఏళ్లుగా ఈ చెత్త పనులు చేశాం..


దీనికి పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సమాధానమిస్తూ.. అమెరికకా, బ్రిటన్ సహా పశ్చిమదేశాల కోసమే మూడు దశాబ్దాల పాటు మేం ఈ చెత్త పనులన్నీ చేస్తున్నామని అన్నారు. దానివల్ల పాక్ చాలా ఇబ్బందులు పడినట్లు చెప్పుకొచ్చారు. అది పొరబాటు చర్య అని ఆ తర్వాత అర్థమైందని అన్నారు. సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో పాక్ చేరకపోయి ఉంటే.. ఇప్పుడు తిరుగులేనని ట్రాక్ రికార్డ్ ఉండేదని అన్నారు.


లష్కరే తోయిబా పాత పేరు..


లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ గురించి వేసిన మరో ప్రశ్నకు బదులిచ్చిన ఖవాజా.. అది పాత పేరు అని, ఇప్పుడు తమ దేశంలో లష్కరే తోయిబా ఉనికి లేదని అన్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుండగా.. భారతీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పహల్గాం దాడికి పాల్పడింది కూడా వీళ్లేనని.. తగిన చర్యలు తీసుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com