పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడంపై పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలావల్ భుట్టో చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తీవ్రంగా స్పందించారు. పాకిస్థాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన హెచ్చరించారు.సింధ్ ప్రావిన్స్లోని సుక్కూర్లో ఇటీవల జరిగిన బహిరంగ సభలో బిలావల్ మాట్లాడుతూ, "సింధు నది మాది, అది మాకే సొంతం. దానిలో మా నీరు ప్రవహిస్తుంది లేదా వారి భారతీయుల రక్తం ప్రవహిస్తుంది" అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై హర్దీప్ పూరి శుక్రవారం గట్టిగా బదులిచ్చారు."ఆయన బిలావల్ వ్యాఖ్యలు విన్నాను. అతన్ని ఎక్కడైనా నీళ్లలో దూకమని చెప్పండి. అసలు నీళ్లే లేకపోతే ఎలా దూకుతాడు అలాంటి వ్యాఖ్యలకు విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. వారికి విషయం అర్థమవుతుంది" అని పూరి వ్యాఖ్యానించారు.పహల్గామ్లో జరిగిన సంఘటన స్పష్టంగా పొరుగు దేశం ప్రేరేపిత సరిహద్దు ఉగ్రవాద దాడి అని, దీనికి వారే ఉగ్రవాదులే బాధ్యత తీసుకుంటున్నారని కేంద్ర మంత్రి అన్నారు. "గతంలో మాదిరిగా కాకుండా ఇకపై ఎలాంటి రాకపోకలు కొనసాగవు. ప్రధాని మోదీ చెప్పినట్లు, పాకిస్థాన్ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఆరంభం మాత్రమే. ఉగ్రవాదులు ప్రాథమిక జీవించే హక్కును హరిస్తున్నారు. దీన్ని ప్రపంచమంతా ఖండిస్తోంది. పాకిస్తాన్ కేవలం బాధ్యతారహిత దేశం మాత్రమే కాదు, అది పతనావస్థలో ఉన్న దేశం" అని పూరి తీవ్ర పదజాలంతో విమర్శించారు.లండన్లోని పాకిస్థాన్ హైకమిషన్లో ఆ దేశ ఆర్మీ, ఎయిర్ అడ్వైజర్ కల్నల్ తైమూర్ రహత్ గొంతు కోస్తున్నట్లు చేసిన సైగ గురించి కూడా పూరి ప్రస్తావించారు. "ఇది ప్రభుత్వ ప్రాయోజిత ఉగ్రవాదం. వారు మూల్యం చెల్లించాల్సిన సమయం వచ్చింది. సింధు జలాల ఒప్పందం నిలిపివేతను తట్టుకోగలమని వారు పాకిస్థాన్ భావిస్తే, వారికి నా శుభాకాంక్షలు" అని ఆయన అన్నారు.
![]() |
![]() |