సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం వద్ద జరిగిన దుర్ఘటనపై మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందన్నారు. క్షతగాత్రులను విశాఖపట్నం కేజీహెచ్లో చికిత్స అందిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. హోంమంత్రి అనిత ప్రమాదస్థలిలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు.
![]() |
![]() |