పహల్గాంలో ఇటీవల జరిగిన ఘోర ఉగ్రదాడిపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన కొద్దిసేపటికే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్తో సమావేశమయ్యారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని ప్రధాని అధికారిక నివాసం 7, లోక్ కళ్యాణ్ మార్గ్లో వీరి భేటీ జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.ఆర్ఎస్ఎస్ కీలక సమావేశాల్లో పాల్గొనేందుకు మోహన్ భగవత్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ప్రధానితో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన తరుణంలో ఈ భేటీ జరిగింది. గత వారం ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్ మైదానంలోకి చొరబడిన పాకిస్థాన్ ఆధారిత లష్కరే తోయిబాకు చెందిన ఐదారుగురు ఉగ్రవాదులు పర్యాటకులపై లక్ష్యంగా దాడి చేసి 26 మందిని పొట్టనబెట్టుకున్న విషయం తెలిసిందే.
![]() |
![]() |