ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్ దాడుల్లో చనిపోయిన పౌర కుటుంబాలకు నష్టపరిహారం

national |  Suryaa Desk  | Published : Sat, May 10, 2025, 08:32 PM

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా దాడులు చేసి.. 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చింది. దీంతో దాయాది దేశం కూడా ప్రతిదాడులకు పాల్పడుతోంది. ముఖ్యంగా సరిహద్దు వెంబడి ఉన్న స్థానిక పౌరులు, సైనికులనే లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతోంది. ఇలా ఇప్పటికే 20 మంది అమాయక పౌరుల ప్రాణాలను కూడా తీసింది. తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మృుతుల కుటుంబాలను పరామర్శించారు. అండగా ఉంటామని హామీ ఇస్తూనే.. ప్రభుత్వం తరఫున నష్టపరిహారం ప్రకటించారు. ఒక్కో మృతుడి కుటుంబానికి మొత్తంగా రూ.10 లక్షల రూపాయలు అందజేస్తామని వెల్లడించారు.


పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు చేసింది. దీంతో దాయాది దేశం సరిహద్దు వెంబడి ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. ముఖ్యంగా నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులు జరుపుతోంది. పహల్గాం దాడి జరిగిన తర్వాత నుంచి కాల్పులు చేస్తూ కవ్వించిన పాక్.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రజల ప్రాణాలు తీయడం ప్రారంభించింది.


కశ్మీర్‌లోని శ్రీనగర్, రాజౌరి, పూంఛ్, పఠాన్‌కోట్ ప్రాంతాల్లో పాక్ డ్రోన్‌లతో దాడులు జరుపుతోంది. ఈ దాడుల్లో జమ్ము కశ్మీర్ ప్రభుత్వ అధికారి రాజ్ కుమార్ థప్పా సహా దాదాపు 20 మంది అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 50 మందికి పైగా గాయపడ్డారు. అయితే మృతుల్లో మహిళలు సహా చిన్న చిన్న పిల్లలు కూడా ఉండగా.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కన్నీటి పర్యంతం అవుతూనే.. దారుణాలను చూడలేకపోతున్నానని చెప్పారు.


అలాగే ప్రభుత్వ ఉన్నతాధికారి మృతి గురించి మాట్లాడుతూ.. అతడు చనిపోవడానికి ముందు రోజే తాను అధ్యక్షత వహించిన ఆన్‌లైన్ సమావేశంలో పాల్గొన్నట్లు గుర్తు చేశారు. కానీ మరుసటి రోజే పాకిస్థాన్.. రాజౌరిలోని అతడి ఇంటిపై దాడి చేసిందని.. ఇలా ఆయన ప్రాణాలు కోల్పోయారని సీఎం ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూనే.. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే ఇప్పటి వరకు పాక్ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు నష్ట పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరఫున ఒక్కో మృతుడి కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తామని న్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa