భారత్ సైన్యం ఆపరేషన్ సిందూర్లో హతమైన ఉగ్రవాదులకు ఆర్మీ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించడం, పాక్ ఆర్మీ ఉన్నతాధికారులు హాజరు కావడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. తమ అధికారులు పాల్గొనలేదని ముందు దాయాది బుకాయించినా.. భారత్ ఆధారాలు విడుదల చేసేసరికి పాక్ గొంతులో పచ్చి వెలక్కాయపడ్డయ్యింది. ఈ నేపథ్యంలో అంత్యక్రియల్లో పాల్గొన్న పాక్ ఆర్మీ అధికారుల వివరాలను భారత్ విదేశాంగశాఖ తాజాగా బయటపెట్టింది. ఇందులో ఉన్నతస్థాయి అధికారులు ఉండటం గమనార్హం. ఆపరేషన్ సిందూర్లో పాకిస్థాన్ భూభాగంలో మురీద్కేలోని లష్కరే తొయిబా, జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాయిద్దీన్ ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం విరుచుకుపడింది
ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ ఆర్మీ లాహోర్ ఐవీ కార్ప్స్ కమాండర్ లెఫ్ట్నెంట్ జనరల్ ఫయ్యాజ్ హుసేన్ షా, లాహోర్ 11వ ఇన్ఫ్రాంట్రీ డివిజన్ మేజర్ జనరల్ రావు ఇమ్రాన్ సర్తాజ్, బ్రిగేడియర్ మహ్మద్ ఫర్ఖాన్ షబ్బీర్, పంజాబ్ పోలీస్ విభాగం ఐజీ డాక్టర్ ఉస్మాన్ అన్వర్, పంజాబ్ ప్రావిన్స్ అసెంబ్లీ సభ్యుడు మాలిక్ సోహైబ్ అహ్మద్ భెర్త్ పాల్గొన్నట్టు భారత్ తెలిపింది. అటు, ఆపరేషన్ సిందూర్లో భారత్ సైన్యం 100 మందికిపైగా ఉగ్రవాదులను హతమార్చినట్టు వెల్లడించిన విషయం తెలిసిందే.
బహావల్పూర్లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయంపై మే 7న తెల్లవారుజామున భారత్ సైన్యం చేసిన దాడిలో జైషే వ్యవస్థాపకుడు మౌలానా మసూద్ అజార్ సోదరి, బావమరుదులు, మేనల్లుడు సహా పది మంది కుటుంబసభ్యులు, మరో నలుగురు అతడి ముఖ్య అనుచరులు హతమయ్యారు. హతమైన మోస్ట్ వాంటెండ్ ఉగ్రవాదుల్లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజార్ బావమరుదులు ఇద్దరు.(పెద్ద బావమరింది హఫీజ్ మహ్మద్ జమీల్, ఇంకో బావరమరిది మహ్మద్ యూసఫ్ అజార్), మురీద్కే స్థావరంలో ముదాస్సర్ ఖదాయిస్ ఖాస్తో (లష్కరే తొయిబా) ఖలీద్, మహ్మద్ హసన్ ఖాన్ ఉన్నట్టు నిఘా వర్గాలకు సమాచారం అందింది. వీరికి పాక్ సైన్యం అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది.
లష్కరే తొయిబా ముదస్సర్ ఖద్యాన్ ఖాస్ అంత్యక్రియల్లో పాక్ సైన్యం గౌరవ వందనం సమర్పించింది. సైన్యాధిపతి జనరల్ ఆసిం మునీర్, పంజాబ్ ముఖ్యమంత్రి మరియమ్ నవాజ్ తరఫున పుష్పగుచ్ఛాలు సమర్పించారు. ఇక, బహావల్పూర్లోని మార్కజ్ సుబ్హాన్ అల్లా శిబిరానికి నాయకత్వం వహించే మసూద్ పెద్ద బావమరిది హఫీజ్ మహ్మద్ జమీల్, మసూద్ చిన్న బావమరిది యూసఫ్ అజహార్ అలియాస్ ఉస్తాద్ జీ. మహ్మద్ సలీమ్. జైషే సంస్థకు ఆయుధ శిక్షణ బాధ్యతల్ని నిర్వహిస్తుండేవాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa