ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రష్యా మరో ఆఫర్.. భారత్‌కు ఎస్-500?

national |  Suryaa Desk  | Published : Tue, May 13, 2025, 10:36 AM

పాక్ డ్రోన్లు, యుద్ధవిమానాలను ఎస్-400తో తిప్పికొట్టిన భారత్‌కు మరింత ఆధునికమైన ఎస్-500 రక్షణ వ్యవస్థను రష్యా ఇవ్వాలని ప్రతిపాదించినట్టు సమాచారం. ఈ వ్యవస్థను భారత్‌లోనే తయారుచేయాలని రష్యా ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రక్షణ నిపుణులు దీనిపై సోషల్ మీడియాలో చెబుతుండగా, ఇరు దేశాల నుంచి అధికారిక ధృవీకరణ మాత్రం ఇంకా రావాల్సి ఉంది. ఇది భారత్ రక్షణ శక్తిని మరింతగా పెంపొందించే అవకాశముంది.అంత ప్రమాదకరమైన ఎస్ 500 మిస్సైల్ సిస్టం తీసుకువస్తుంది ఇండియా. రష్యా ప్రతిపాదించిన ఈ మిస్సైల్ ను ఇండియా లోనే తయారు చేయాలని అనుకుంటున్నారట. ఈ మేరకు ఇండియాకు ఆఫర్ కూడా ఇచ్చింది రష్యా. దీంతో.. అతి త్వరలోనే ఎస్ 500 మిస్సైల్ సిస్టన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఎస్ 400 మిస్సైల్ సిస్టం... పవర్  600 కిలోమీటర్ల పరిధి ఉంటుంది. ఆ పరిధిలో ఉన్న శత్రువులను మట్టి కరిపిస్తుంది. అయితే ఈ ఎస్ 500 మిస్సైల్ 3000 కిలోమీటర్ల వరకు పనిచేస్తుందని చెబుతున్నారు. ఈ మూడు వేల కిలోమీటర్ల రేంజ్ లో ఉన్న శత్రువులను మట్టికరిస్తుంది ఎస్ 500  మిస్సైల్. అంటే ఈ లెక్కన పాకిస్తాన్ భూస్థాపితం కావడం గ్యారెంటీ అంటున్నారు. ఈ మిస్సైల్ హైపర్నోక్సిక్ కృయిస్ మిస్సైల్, విమానాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని చెబుతున్నారు. అటు పాకిస్తాన్ వాడుతున్న చైనా అలాగే టర్కీ  డ్రోన్లు  ఏ మాత్రం పనిచేయడం లేదన్న సంగతి తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com