ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్ అణుస్థావరాల నుంచి రేడియేషన్ లీక్.. ఐఏఈఏ కీలక ప్రకటన

international |  Suryaa Desk  | Published : Fri, May 16, 2025, 11:54 PM

భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్థాన్‌లోని అణు స్థావరాలు దెబ్బతిని, వాటి నుంచి రేడియోధార్మికత విడుదలవుతోన్నట్టు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, అమెరికా నుంచి నిపుణుల బృందం కూడా పాక్‌కు చేరుకుని, పరిస్థితిని సమీక్షించినట్టు ఊహగానాలు వెలువడుతున్నాయి. తాజాగా, ఈ ప్రచారంపై అంతర్జాతీయ అణుశక్తి సంస్థ స్పందించింది. పాకిస్థాన్‌లోని అణుస్థావరాలు ధ్వంసం కాలేదని, ఎటువంటి రేడియేషన్ విడుదల కాలేదని స్పష్టం చేసింది. భారత క్షిపిణి దాడిలో పాకిస్థాన్ సర్గోదాలోని కిరానా హిల్స్‌ అణుస్థావరం దెబ్బతిన్నట్టు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే.


ఈ అంశంపై టైమ్స్ ఆఫ్ ఇండియా అడిగిన ప్రశ్నకు IAEA మీడియా విభాగం చీఫ్ ఫ్రెడ్రిక్ డాల్‌హ్ టాప్.. మెయిల్‌లో సమాధానం పంపారు. ‘పాకిస్థాన్ అణుస్థావరం నుంచి రేడియేషన్ వెలువడుతోందనే వార్తలను మేం తెలుసుకున్నాం. IAEA దగ్గర ఉన్న సమాచారం ఆధారంగా, పాక్‌లోని ఏ అణుస్థావరం నుంచి కూడా రేడియేషన్ లీకేజ్ లేదా విడుదల జరగలేదు’ అని తెలిపారు. దీంతో పాక్ అణుస్థావరాలపై దాడి జరిగినట్టు సోషల్‌ మీడియా, విదేశీ మీడియాలో వస్తోన్న ఊహగానాలకు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ తెరదించింది.


లీక్‌పై వార్తలు ఖండించిన భారత్


భారత వైమానికదళ ఛీఫ్, ఎయిర్ మార్షల్ ఏ.కె. భర్టీ కూడా కిరానా హిల్స్‌ లేదా పాక్‌కు చెందిన ఏ అణుస్థావరం కూడా భారత వైమానిక దాడి జరగలేదని ఇటీవల స్పష్టం చేశారు. ‘కిరానా హిల్స్‌లో అణుస్థావరం ఉందనే విషయాన్ని మీడియా చెప్పినందుకు ధన్యవాదాలు. మేము అటువంటి సమాచారంపై దృష్టి పెట్టలేదు. అక్కడ మేము దాడి చేయలేదు’ అని భట్టీ తెలిపారు.


విదేశాంగశాఖ కూడా రేడియేషన్ లీకేజ్ కథనాలను ఖండించింది. విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి రణధీర జైస్వాల్‌ బుధవారం ప్రెస్‌ బ్రీఫింగ్‌లో ‘‘మన సైనిక చర్యలు సంప్రదాయ పరిధిలోనే జరిగాయి.. పాకిస్థాన్ నేషనల్ కమాండ్ అధికారి సమావేశం ఏర్పాటు చేస్తారని వార్త చక్కర్లు కొట్టింది… అయితే అధికారికంగా పాక్ దాన్ని ఖండించింది’ అన్నారు. భారత్ దాడిలో పాకిస్థాన్ వైమానిక స్థావరాలు, రాడార్ కేంద్రాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే.


రేడియేషన్ విడుదలైనట్టు జరుగుతోన్న తప్పుడు ప్రచారానికి తెరదించేందుకు ఐఈఏఈ ప్రకటన విడుదల చేసింది. అంతర్జాతీయ విశ్లేషకులు, అంతర్జాతీయ మీడియాలో దీనిపై కథనాలు రావడంతో భయాందోళనలను నివారించడానికి IAEA ముందుకు వచ్చింది. ఫుకుషిమా వంటి అణు ప్రమాదాల సమయంలో సాధారణంగా మోహరించిన అమెరికా ఇంధన శాఖ విమానం.. పాకిస్థాన్ సమీపంలో పనిచేస్తున్నట్లు విమాన ట్రాకింగ్ ప్లాట్‌ఫామ్‌లు గుర్తించిన తర్వాత ఈ పుకార్లు మరింతగా వ్యాపించాయి.


పాక్‌ దాడుల వెనుక చైనా హస్తం.. కీలక ఆధారాలు స్వాధీనం


అంతేకాదు, రేడియేషన్‌ను అరికట్టే రసాయానాలతో ఈజిప్టు విమానం పాక్‌లో ల్యాండ్ అయ్యిందనే కథనాలు కూడా వెలువడ్డాయి. అయితే, ఇందులో ఏమాత్రం నిజం లేదని మాజీ సైనిక అధికారులు కొట్టిపారేశారు.


కిరానా హిల్స్


కిరానా హిల్స్‌‌ను పాకిస్థాన్ అత్యంత రక్షిత యుద్ధ స్థావరాల్లో ఒకటిగా భావిస్తారు. ఇక్కడ పదుల సంఖ్యలో అణ్వాయుధ సొరంగాలు ఉన్నాయని అంచనా. ఇది ఖుషాబ్ న్యూక్లియర్ కాంప్లెక్స్‌ నుంచి సుమారు 75కి.మీ. దూరంలో ఉంది. ఆ కేంద్రంలో నాలుగు హెవీ వాటర్ రియాక్టర్లు, ఆయుధాల్లో వాడే ప్లూటోనియం ఉత్పత్తి జరుగుతుంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com