ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి సర్కారు ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తోంది. సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్న ప్రభుత్వం.. కూటమి పాలనకు ఏడాది పూర్తి అయిన సందర్భంగా తాజాగా.. తల్లికి వందనం పథకం నిధులు కూడా విడుదల చేసింది. అలాగే రైతులకు పెట్టుబడి సాయంగా అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20 వేలు అందించేందుకు సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ యోజనతో కలిసి అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయనున్నారు. పీఎం కిసాన్ యోజన కింద ఏడాదికి రూ.6000 అందిస్తుండగా.. అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.14000 అందించనుంది. అయితే జూన్ 20వ తేదీ పీఎం కిసాన్ నిధులతో పాటుగా అన్నదాత సుఖీభవ నిధులు కూడా విడుదల చేయనున్నారు.
అన్నదాత సుఖీభవ కింద ఒక్కో రైతుకు ఏడాదికి మూడు విడతల్లో రూ.20 వేలు అందిస్తారు. తొలి విడతగా జూన్ 20న రూ.7 వేలు రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయనున్నారు. ఇందులో పీఎం కిసాన్ యోజన కింద రూ.2000.. అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.5000 అందివ్వనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రూ. 14000లను, 5000, 5000, 4000 చొప్పున మూడు విడతల్లో అందించనుంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. తొలి విడతగా జూన్ 20న రూ.7000 రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు.
మరోవైపు అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతుల వివరాలను అధికారులు ఇప్పటికే ఎంపిక చేసి.. ప్రభుత్వానికి పంపించారు. అలాగే ఎంపిక చేసిన రైతుల జాబితాను రైతు సేవా కేంద్రాల వద్ద ప్రదర్శిస్తున్నారు. అయితే జూన్ 20వ తేదీన విడుదల చేసే రూ.7000 అన్నదాత సుఖీభవ సాయం అందాలంటే రైతులు తప్పనిసరిగా ఓ పని చేయాల్సి ఉంది. అన్నదాత సుఖీభవ పథకం లబ్ధిదారులకు ప్రభుత్వం ఈ- కేవైసీ తప్పనిసరి చేసింది.
ఈ నేపథ్యంలో అర్హులైన రైతులు తమ సమీపంలోని రైతు సేవా కేంద్రంలో ఈకేవైసీ పూర్తి చేసుకుంటేనే డబ్బులు పడతాయని అధికారులు చెప్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకం ఈ కేవైసీకి జూన్ 20వ తేదీ ఆఖరి తేదీ అని.. ఆ లోగా రైతులు.. రైతు సేవా కేంద్రాలలో బయోమెట్రిక్ ద్వారా ఈ కేవైసీ పూర్తి చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అన్నదాత సుఖీభవ సాయం అందిస్తామని చెప్తున్నారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa