ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముగ్గురు సెంచరీలు చేసినా 471కే భారత్ ఆలౌట్

sports |  Suryaa Desk  | Published : Sat, Jun 21, 2025, 11:14 PM

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 471 పరుగులకు ఆలౌట్ అయింది. ఓ దశలో 430/3తో పటిష్ట స్థితిలో నిలిచిన భారత్.. ఆ తర్వాత అనూహ్యంగా తడబడింది. చివరి 7 వికెట్లను కేవలం 41 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది. దీంతో ముగ్గురు బ్యాటర్లు సెంచరీలు చేసినా.. టీమిండియా 500 పరుగుల మార్కును దాటలేకపోయింది. యశస్వి జైశ్వాల్, శుభ్‌మన్ గిల్ , రిషభ్ పంత్ సెంచరీలతో సత్తాచాటారు.


ఓవర్‌నైట్ స్కోరు 359/3తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత్.. చాలా సేపటి వరకు వికెట్ కోల్పోయింది. దీంతో ఈ సెషన్‌ను వికెట్ కోల్పోకుండానే ముగించేలా కనిపించింది. ఈ క్రమంలోనే రిషభ్ పంత్.. టెస్టుల్లో తన 7వ సెంచరీని కొట్టాడు. ఇంగ్లాండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన ఈ ప్లేయర్.. సిక్స్ కొట్టి శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలోనే గిల్, పంత్‌ జోడీ నాలుగో వికెట్‌కు 200 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించారు.


అయితే జట్టు స్కోరు 430/3 వద్ద కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (147) నాలుగో వికెట్‌గా ఔట్ అయ్యాడు. దీంతో 209 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఇక శుభ్‌మన్ గిల్ ఔట్ అయ్యాక టీమిండియా బ్యాటింగ్ యూనిట్ సైకిల్ స్టాండ్‌ను తలపించింది. ఏడేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడుతున్న కరుణ్ నాయర్.. ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ చేరిపోయాడు. శార్దుల్ ఠాకూర్, బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణలు కూడా సింగిల్ డిజిట్‌కే ఔట్ అయ్యారు. 134 పరుగులు చేసిన రిషభ్ పంత్‌.. ఆరో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ చివరి 7 వికెట్లను కేవలం 41 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది. 113 ఓవర్లలో 471 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టంగ్ 4, బెన్ స్టోక్స్ 4 చొప్పున వికెట్లు తీయగా.. బ్రైడన్ కేర్స్ 1, షోయబ్ బషీర్ ఇంకో వికెట్ తీశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa