ఏబీ డివిలియర్స్ సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్లో టైటిల్ కోసం ఎంతో శ్రమించినా..అతడికి టైటిల్ మాత్రం దక్కలేదు. దీంతో టైటిల్ గెలవకుండానే అతడు.. తన ప్రొఫెషనల్ క్రికెట్ కెరీర్ను ముగించాడు. అయితే తాజాగా వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025లో పాల్గొన్న ఏబీడీ.. కప్పు కలను నెరవేర్చుకున్నాడు. కెప్టెన్గా జట్టును ముందుండి నడిపించి.. తన కెరీర్లో తొలి టైటిల్ అందుకున్నాడు. శనివారం పాకిస్థాన్ ఛాంపియన్స్తో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ ఫైనల్లో ఏబీడీ అజేయ సెంచరీతో దక్షిణాఫ్రికా విజేతగా నిలిచింది.
టీమిండియా ఛాంపియన్స్ టీమ్.. సెమీ ఫైనల్ నుంచి తప్పుకోవడంతో పాకిస్థాన్ టీమ్ నేరుగా ఫైనల్ చేరింది. దీంతో దక్షిణాఫ్రికాతో తలపడాల్సి వచ్చింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్కు దిగిన దక్షిణాఫ్రికా.. ఏబీ డివిలియర్స్ విధ్వంసంతో మరో 19 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో జయభేరీ మోగించింది. టైటిల్ను అందుకుంది.
41 ఏళ్ల ఏబీడీ ఈ టోర్నీలో విశేషంగా రాణించాడు. వయసు అనేది కేవలం నెంబర్ మాత్రమే అని నిరూపిస్తూ.. సెంచరీలతో చెలరేగిపోయాడు. ఏకంగా మూడు సెంచరీలు చేశాడు. ఫైనల్లోనూ 60 బంతుల్లో 120 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. ఒంటిచేత్తో తన జట్టుకు టైటిల్ అందించాడు. కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు ఆటగాడిగా టైటిల్ సాధించలేకపోయిన ఏబీడీ.. రిటైర్మెంట్ ప్రకటించాక మాత్రం తన కలను నెరవేర్చుకున్నాడు. ఇదే టోర్నీలో క్రితం ఫైనల్లో భారత్ చేతిలో ఓడిపోయిన పాక్.. తాజాగాకు దక్షిణాఫ్రికా చేతిలో పరాజయం పాలైంది.
డివిలియర్స్కు కలిసొచ్చిన 2025..
ఏబీ డివిలియర్స్కు 2025 సంవత్సరం కలిసొచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇదే ఏడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తొలి ఐపీఎల్ టైటిల్ సాధించింది. దక్షిణాఫ్రికా జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్గా అవతరించింది. తాజాగా ఏబీడీ సారథ్యంలోని టీమ్ సైతం టైటిల్ అందుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa