బెంగళూరులో విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. జపాన్కు చెందిన ప్రఖ్యాత వెబ్ సిరీస్ "డెత్ నోట్" చూసిన తర్వాత 14 ఏళ్ల బాలుడు గంగాధర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో చోటుచేసుకుంది. బాలుడు సదరు సిరీస్లో చూపిన అంశాల్లో లీనమై జీవితంపై నైరాశ్యంతో ఉండేవాడిగా తెలుస్తోంది.
గంగాధర్, ప్రసిద్ధ మ్యూజిషియన్ గణేష్ మరియు గాయకురాలు సవిత దంపతుల కుమారుడు. సంగీత నేపథ్యంలో పెరిగిన బాలుడు, చదువులో చురుకుగా ఉండే వాడు. అయితే, ఇటీవల అతడు ఎక్కువ సమయం ఒంటరిగా గడుపుతూ వెబ్ సిరీస్లు ఎక్కువగా చూస్తుండేవాడని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ప్రత్యేకించి "డెత్ నోట్"లో చూపిన గంభీరమైన మరియు మనస్తత్వాన్ని ప్రభావితం చేసే అంశాలపై అతడి ఆసక్తి ఎక్కువగా పెరిగింది.
ఆ సంఘటన రోజు గంగాధర్ తన గదిలోకి వెళ్లి గిటార్ స్ట్రింగ్తో ఉరివేసుకున్నాడు. ఘటన స్థలంలో పోలీసులు తనిఖీలు నిర్వహించిన సమయంలో, అతడి చేతిలో ఆత్మహత్యా నోట్ కనిపించింది. అందులో "నేను వెళ్లే సమయం ఆసన్నమైంది... మీరు ఈ లేఖ చదివే సమయానికి నేను స్వర్గంలో ఉంటా" అని రాసి ఉండడం గమనార్హం. ఇది మానసిక స్థితిపై డెత్ నోట్ ప్రభావాన్ని తెలియజేస్తోంది.
ఈ సంఘటనతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. బాలుడిపై డిజిటల్ కంటెంట్ ఎలా ప్రభావం చూపుతుందో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. బాలలు ఏవిధమైన కంటెంట్ చూస్తున్నారు, ఎలాంటి సీరీస్లతో మానసికంగా ప్రభావితమవుతున్నారు అనే విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతగానో ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa