ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయవాడలో డయోరియా విజృభిస్తున్న ప్రాంతాలలో పర్యటించిన వైసీపీ నాయకులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 15, 2025, 12:42 PM

విజయవాడ నగరంలో ప్రజారోగ్యాన్ని కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసిందని వైయస్ఆర్‌సీపీ ప్రతినిధి బృందం మండిపడింది. వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్ ఆదేశాలతో డయోరియాతో వణికిపోతున్న న్యూ రాజరాజేశ్వరీ పేటలో పార్టీ ప్రతినిధి బృందం పర్యటించింది. అక్కడి రోగులను, స్థానికులను పరామర్శించి, ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్యశిబిరం, అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించింది. దాదాపు ఏడు వందలకు పైగా డయోరియా కేసులు నమోదైన నేపథ్యంలో మెడికల్ ఎమర్జెన్సీగా పరిగణించి, అత్యవసర వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని పార్టీ ప్రతినిధి బృందం ఆగ్రహం వ్యక్తం చేసింది. నామమాత్రపు వైద్య సేవలతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ధ్వజమెత్తింది. ఈ ప్రతినిధి బృందంలో ఎన్టీఆర్ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు దేవినేని అవినాశ్‌, స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ స‌మ‌న్వ‌య‌క‌ర్త గ‌జ్జ‌ల సుధీర్ భార్గ‌వ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మ‌ల్లాది విష్ణు, మొండితోక జ‌గ‌న్‌మోహ‌న్‌ రావు, మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మి, రాష్ట్ర నాయకులు షేక్ ఆసిఫ్‌, వైయ‌స్ఆర్‌సీపీ విద్యార్థి విభాగం స్టేట్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ర‌విచంద్ర‌ త‌దిత‌రులు ఉన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa