ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎంపీ మిథున్ రెడ్డిని వేధిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతల ఆరోపణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 15, 2025, 08:07 PM

రాజంపేట పార్లమెంట్ సభ్యులు ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలులో అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, మాజీ విప్ కొరముట్ల శ్రీనివాసులు తదితరులు కలిశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ, మూడుసార్లు ఎంపీగా ఎన్నికైన మిథున్ రెడ్డిని, వారి తల్లిదండ్రులను మానసికంగా వేధించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎటువంటి విచారణ చేయకుండా, కేవలం కస్టడీకి తీసుకుని జైల్లో నిర్బంధించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa