పోర్టులు, ఎయిర్ పోర్టులు, రోడ్లు, మెడికల్ కాలేజీలు, టూరిజం.. ఇలా ఏ ఒక్క విభాగాన్ని వదలకుండా అన్నింటినీ చంద్రబాబు ప్రైవేటుపరం చేసేస్తున్నాడు అని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. అయన మాట్లాడుతూ... వైయస్ జగన్ సంపద సృష్టిస్తే చంద్రబాబు నేతృత్వంలో కూటమి నాయకులు ఆ సంపదను పంచుకుతింటున్నారు. విలువైన ప్రభుత్వ ఆస్తులను పప్పు బెల్లాల మాదిరిగా తన వారికి కట్టబెట్టేస్తున్నాడు. కలెక్టర్ల సదస్సులో కూడా తప్పుడు లెక్కలతో గొప్పలు చెప్పుకోవడం, వైయస్ఆర్సీపీ మీద బురదజల్లడం తప్ప చంద్రబాబు ఒక్క నిజం మాట్లాడటం లేదు. వైయస్ జగన్ తీసుకొచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసి చంద్రబాబు చరిత్రహీనుడిగా నిలిచిపోయాడు. ప్రభుత్వం బాధ్యతగా నిర్వర్తించాల్సిన విద్య, వైద్య రంగాలను చంద్రబాబు పూర్తిగా నిర్వీర్యం చేశాడు. నాణ్యమైన మద్యం ఇస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన విజనరీ చంద్రబాబు. విజనరీనని మాటల్లో చెప్పడం కాదు. ఆచరణలో విజనరీగా చంద్రబాబు నిరూపించుకోవాలి. భూమి విషయంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు రాకుండా నాడు వైయస్ జగన్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొస్తే, దానిమీద చంద్రబాబు దుష్ప్రచారం చేశాడు. అధికారంలోకి వస్తానే రద్దు చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి అదే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ను కొనసాగిస్తున్నాడు. పథకం ప్రకారం సంజీవని లాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని లేకుండా చేస్తున్నాడు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే తట్టుకోలేక వైయస్ఆర్సీపీ నాయకుల మీద తప్పుడు కేసులు పెట్టి గొంతు నొక్కాలని చూస్తున్నాడు. వైయస్ఆర్సీపీ నాయకులు ఇలాంటి తప్పుడు కేసులకు భయపడటం జరగదు. ప్రజా సమస్యలపై పోరాటంలో వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదని చంద్రబాబు తెలుసుకోవాలి అని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa